కళాశాల అభివృద్ధికి, విద్యార్థులలో నైపుణ్యానికి కృషి చేస్తా
ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రధానాచార్యురాలు డాక్టర్ విజయభారతి
విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా):- తోటి అధ్యాపకులతోనే గాక, విద్యార్థినీ, విద్యార్థులతో కలిసి కళాశాల అభివృద్ధికి, విద్యార్థులలో నైపుణ్యాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రధానాచార్యురాలు డాక్టర్ ఎం విజయభారతి అన్నారు. బుధవారం ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చింతపల్లిలో సువిశాలమైన స్థలం ఉందన్నారు. ఈ ప్రాంతంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుందన్నారు. విద్యార్థులలోనూ అనేక రకాల నైపుణ్యం ఉందన్నారు. వారిలో విద్యతోపాటు ఇతర రంగాలపై ఉన్న నైపుణ్యాన్ని గుర్తించి ప్రోత్సహిస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్నారు. కళాశాల అభివృద్ధిలోనూ అధ్యాపకులతో పాటు విద్యార్థిని విద్యార్థులు భాగస్వాములవుతున్నారన్నారు. ఇందులో భాగంగానే శ్రమదానంతో సైకిల్ స్టాండ్ ఏర్పాటు, గార్డెన్ నిర్వహణ తదితర వాటితో పాటు కళాశాల పరిసరాలను సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. తన ఆలోచనా విధానానికి అధ్యాపకులు, విద్యార్థిని, విద్యార్థులు, కళాశాల సిబ్బంది సహకరిస్తున్నారని ఆమె సంతోషం వ్యక్తం చేశారు