Friday, May 17, 2024
Friday, May 17, 2024

లక్ష విలువ చేసే లిక్విడ్ గంజాయి స్వాధీనం.. ఒకరు అరెస్ట్

అన్నవరం ఎస్ఐ రాజారావు

విశాలాంధ్ర – చింతపల్లి( అల్లూరి సీతారామరాజు జిల్లా ):- సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నిర్వహిస్తున్న తనిఖీలలో భాగంగా తమకు అందిన ముందస్తు సమాచారం మేరకు మండలంలోని అన్నవరం పోలీసు స్టేషన్ పరిధిలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తుండగా సుమారు 1 లక్ష రూపాయల విలువ చేసే ఒక కేజీ లిక్విడ్ గంజాయితో ఉన్న వ్యక్తిని గుర్తించి అరెస్టు చేయడం జరిగిందని అన్నవరం ఎస్సై రాజారావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందస్తు సమాచారంతో తమ సిబ్బందితో కలిసి కొత్తూరు బయలు జంక్షన్ వద్ద సోమవారం తనిఖీలు నిర్వహిస్తుండగా లిక్విడ్ గంజాయి పట్టుబడిందన్నారు. ఈమేరకు గంజాయిని స్వాధీనం చేసుకుని, గంజాయి తరలిస్తున్న గొప్పు గుడిసెలు గ్రామానికి చెందిన పాంగి శివాజీ అనే వ్యక్తిని అరెస్టు చేశామని ఎస్సై తెలిపారు. మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నట్లు ఆయన వివరించారు. స్టేషన్ పరిధిలో ప్రతిరోజు ముమ్మరంగా వాహన తనిఖీలు చేపడుతున్నామన్నారు. గంజాయి సాగు, రవాణా, అక్రమ నగదు, అక్రమ మద్యం తరలింపు తదితర అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img