Monday, May 20, 2024
Monday, May 20, 2024

నిరుపేదలకు సేవ చేయడంలోనే సంతృప్తి

నిరుపేద వృద్ధులు మహిళలకు వస్త్రదానం చేసిన చేయూత వారియర్స్ ట్రస్ట్.

విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- నిరుపేదలకు సేవ చేయడంలోనే సంతృప్తి ఉందని చేయూత వారియర్స్ ట్రస్ట్ చైర్మన్ దూనబోయిన రమణ అన్నారు. మండలం, బెన్నవరం పంచాయితీ వట్టిబూసుల మోడల్ కోలనిలో నివాసం ఉంటున్న 40 మంది నిరుపేద వృద్ధులు, మహిళలకు ఆదివారం చేయూత వారియర్స్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వస్త్రధానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేయూత వారియర్స్ ట్రస్ట్ సభ్యుల సహకారంతో నిరుపేద ప్రజలకు సేవ చేయడం సంతృప్తికరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు ఇండుగ శేఖర్, సాగిన జగన్, గంగల శివ తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img