Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

చింతపల్లి మసీదులో ఘనంగా ఇఫ్తార్ విందు

కుల మతాలకతీతంగా హాజరైన ప్రజలు

విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) :- అల్లూరి జిల్లా చింతపల్లి మజీద్ లో రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని కుల మతాలకు అతీతంగా ముస్లింలు ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కుల, మతాలు, రాజకీయ పార్టీలకతీతంగా ఆహ్వానించారు. సుమారు 1500 మందికి పైగా ఏర్పాటు చేసిన ఈ విందు కార్యక్రమానికి పాడేరు శాసనసభ్యురాలు కొట్టగుల్లి భాగ్యలక్ష్మి, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, తెదేపా పాడేరు నియోజకవర్గ అభ్యర్థి కిల్లు రమేష్ నాయుడు, స్థానిక జడ్పిటిసి సభ్యుడు పోతురాజు బాలయ్య, చింతపల్లి, జికే వీధి ఎంపీపీ కోరాబు అనూష దేవి, బోయిన కుమారి, చింతపల్లి, బలపం సర్పంచ్ లు దురియా పుష్పలత, కొర్ర రమేష్ నాయుడు, ఎంపీటీసీ సభ్యురాలు దాసరి ధారలక్ష్మి, స్థానిక ఎస్సై అరుణ్ కిరణ్ లతో పాటు వివిధ పార్టీలకు చెందిన నాయకులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు, వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు, వ్యాపార, ఇతర రంగాలకు చెందిన వందలాదిమంది ముస్లింలు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి బాలరాజు, తెదేపా అభ్యర్థి కిల్లు రమేష్ నాయుడు లు మసీదులో ప్రార్థనలు చేసి ఇమామ్ ఆశీర్వచనాలు అందుకున్నారు. అదే క్రమంలో పాడేరు శాసనసభ్యురాలు భాగ్యలక్ష్మి, మాజీ మంత్రి బాలరాజులకు ముస్లింలు ఖురాన్ గ్రంధాన్ని అందజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img