Monday, May 20, 2024
Monday, May 20, 2024

29 న జాతీయ లోక్ అదాలత్

విశాలాంధ్ర- రాజాం : రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, ఆంధ్ర ప్రదేశ్, అమరావతి మరియు జిల్లా న్యాయ సేవాధికర సంస్థ, శ్రీకాకుళం వారి ఆదేశాల మేరకు రాజాం కోర్ట్ ఆవరణలో తేది 29-06-2024 న ఉదయం గ.10.30 ని. నుండి “జాతీయ లోక్ అదాలత్” నిర్వహించనున్నట్లు మండల్ న్యాయ సేవా సంఘ అధ్యక్షులు మరియు సీనియర్ సివిల్ జడ్జి – సి.హెచ్. వివేక్ ఆనంద్ శ్రీనివాస్ తెలియజేశారు. ఈ లోక్ అదాలత్ లో రాజీకి అనుకూలమైన అన్ని క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, ఫ్రీ లిటిగేషన్ కేసులు ఇరు పార్టీల అంగీకారంతో పరిష్కరించబడునని, ఈ అవకాశాన్ని కక్షిదారులు వినియోగించుకోవాలని కోరారు. రాజీయే రాజమార్గమని, రాజీకి వీలైన ఎక్కువ కేసులను లోక్ అదాలత్ లో పరిష్కరించుకోవాలని, లోక్ అదాలత్ తీర్పు అంతిమ తీర్పు అని అద్యక్షులవారు తెలియజేశారు. అలాగే లోక్ అదాలత్ లో సివిల్ కేసులు పరిష్కారామైతే కోర్ట్ ఫీస్ కూడా వాపసు ఇవ్వబడునని తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img