Sunday, May 19, 2024
Sunday, May 19, 2024

పేరుకే అభ్యర్థులు, ప్రచారాలు లేవు పర్యటనలు లేవు

విశాలాంధ్ర-రాజాం : విజయనగరం జిల్లా రాజాం (ఎస్సీ) నియోజకవర్గ అసెంబ్లీ స్థానానికి పదిమంది అభ్యర్థులు నామినేషన్లు వేసి ఖరారు అయ్యారు. కాని ప్రధాన పార్టీలైన వైఎస్సార్ సీపీ, కూటమి పార్టీలైన బిజెపి, తెలుగుదేశం, జనసేన ఈ రెండు పార్టీల ప్రచార రధాలు, ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు మాత్రమే పోటాపోటీగా ప్రచారాలు సాగిస్తున్నారు.
మరి కొన్ని పార్టీలు అయితే ప్రచార రధాలు మాత్రమే తిరుగుతున్నాయి తప్ప అభ్యర్థులు ప్రచారంలో కనబడటం లేదని, మరికొన్ని పార్టీలు అయితే ప్రచార రథాలు లేవు ప్రచారం లేదు. ప్రచారానికి మిగిలింది మూడు రోజులే మరి వీళ్లు ఎప్పుడు ప్రచారాలు చేస్తారో చూడాలి మరి.ప్రచారాల చేయని అభ్యర్థులు మరి నామినేషన్లు దేనికోసం వేశారు అని.ఇలా ప్రచారాలు, పర్యటనలు చేయని అభ్యర్థులపై ఆయా పార్టీల అధ్యక్షులు దృష్టి సారించాలని స్థానికులు గుసగుసలాడుకుంటున్నారు…

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img