చింతపల్లి తహశీల్దార్ రామకృష్ణ.
విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) : – ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని తహశీల్దార్ టి రామకృష్ణ అన్నారు. శుక్రవారం మండల పరిషత్ సమావేశ మందిరంలో అత్యవసర సమావేశం నిర్వహించిన అనంతరం రెవెన్యూ కార్యాలయం నుంచి అంబేద్కర్ కూడలి వరకు 18 ఏళ్ళు నిండిన యువతి, యువకులు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని, ఓటు హక్కే సమాజ మార్పుకు ఆయుధమని నినదిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 ఏళ్ళు నిండిన యువతీ, యువకులతో పాటు ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరు ఓటు వేసేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ సాగిన చిన్నయ్య పడాల్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ మొట్టడం కృష్ణమూర్తి, మండల సర్వేయర్ సుధాకర్ రావు, సీనియర్ అసిస్టెంట్ బాలరాజు, బిఎల్ఓ లు, వీఆర్వోలు, రెవెన్యూ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.