ఘనంగా భారత కమ్యూనిస్టు పార్టీ 99వ ఆవిర్భావ దినోత్సవం….
విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : తే.25.12.2023ది. భారత కమ్యూనిస్ట్ పార్టీ 99వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చోడవరం నియోజకవర్గం బుచ్చయ్యపేట మండలం వడ్డాది గ్రామంలో సోమవారం సిపిఐ జెండాను, జిల్లా కార్యవర్గ సభ్యుడు కామ్రేడ్ రెడ్డిపల్లి అప్పలరాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కామ్రేడ్ రెడ్డిపల్లి మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీ ప్రజా సంక్షమమే ధ్యేయంగా ఎనలేని పోరాటాలు చేస్తూ, బడుగు బలహీన వర్గాలు, కార్మిక కర్షకుల హాక్కులు గురించి నిరంతరం పోరాటం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది సిపిఐ పార్టీ మాత్రమేనని తెలియజేశారు. ప్రజాస్వామ్యంలో నైతిక హక్కులు పతనం చేసెడి బూర్జువా రాజకీయ పార్టీలను నమ్మరాదని హితవు పలికారు. సమసమాజ స్థాపన కమ్యునిస్ట్ పార్టీ తోనే సాధ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో రావాడ. వరహాలు, వర్రి.సూరిబాబు, గనివాడ.రాము, రావాడ.రాము, కమ్యూనిస్టు పార్టీ అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.