Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

వై.సి.పి. ఎన్నికల ప్రచారం లో ప్రభుత్వ ఉద్యోగి, దర్మశ్రీ సోదరుడు …

విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : తే.30.03.2024ది. అనకాపల్లి జిల్లా చోడవరం తాజా మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కరణం ధర్మ శ్రీ సోదరుడు, ప్రభుత్వ ఉద్యోగి పప్పల వెంకట రమణ మూర్తి సార్వత్రిక ఎన్నికల ప్రచారం లో పాల్గొన్నట్లు ఆరోపణలున్నాయి. 1998 డి.ఎస్సీ. జాబితా లో ఉపాధ్యాయుడుగా ఎంపికై, ప్రస్తుతం ఆరిలోవ ప్రభుత్వ పాఠశాల లో పని చేస్తున్నారు. అంతకు ముందు గోవాడ సుగర్స్ లో ఏ.ఒ. పనిచేసిన రమణ మూర్తి, ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా జాయిన్ అయిన తరువాత ఫ్యాక్టరీ పోస్ట్ కు రాజీనామా చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో తమ సోదరుడు కరణం ధర్మ శ్రీ తరపున ప్రచారం చేస్తూ, ప్రభుత్వ ఎన్నికల నిబంధనలు తుంగలో తొక్కుతుండటం తో ప్రతిపక్షాలు ఆగ్రహావేశం చెందుతున్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img