– మూడు ఇసుక బండ్లుకు 6వేలు జరిమానా
– అక్రమ నిల్వ ఉంచిన ఇసుక కుప్పలు సీజ్ …
విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : అనకాపల్లి జిల్లా చోడవరం మండలంలోని ముద్దుర్తి గ్రామంలో ముందస్తు సమాచారం మేరకు మైన్స్ అధికారులు మంగళవారం మెరుపు దాడులు చేశారు. జిల్లా మైన్స్ సహాయ సంచాలకులు సుబ్బారాయుడు ఆధ్వర్యంలో మైన్స్ సిబ్బంది తో బాటు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు, నీటి పారుదల శాఖ, పోలీస్, రెవిన్యూ అధికారులు ముప్పేట దాడి చేసి ముద్దుర్తి సంఘమేశ్వర స్వామి గుడి దగ్గర మూడు ఇసుక బండ్లు ను పట్టుకొని 2వేలు చొప్పున 6వేలు అపరాధ రుసుము మైన్స్ శాఖ వారు వసూళ్లు చేశారు. అలాగే ఎదురుగా ఉన్న జిరాయితి భూమి మామిడితోటలో అక్రమంగా సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉంచిన ఇసుక కుప్పలను స్వాధీనం చేసుకున్నారు. నదిలోంచి ఇసుక తీస్తున్నవారికి హెచ్చిరికలు చేసి నోటీసులు జారీ చేశారు. ఇదే పునరావృతం అయితే టైర్ బండికి పది వేల రూపాయలు ఫైన్ వసూళ్లు చేస్తామని హెచ్చిరించారు. సీజ్ చేసిన ఇసుక కుప్పలను రెవిన్యూ, ఎస్.ఈ బి. శాఖల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్ లో మైన్స్ రాయల్టీ ఇన్స్పెక్టర్ స్వాతి లతో పాటు ఎస్.ఈ.బి. ఇన్స్పెక్టర్ బి.హెచ్.కిరణ్ మనేశ్వరి, ఇరిగేషన్,పోలీస్, రెవిన్యూ అధికారులు పాల్గొన్నారు.