– ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్.రాజు చేతుల మీదుగా వారసులకు చెక్కులు పంపిణీ…
విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : చోడవరం సహకార చక్కెర కర్మాగారం పరిధిలో మరణించిన 141 మంది సభ్య రైతు కుటుంబాల వారసులకు రైతు సంక్షేమ నిధి నుండి రూ.40 లక్షలు చెక్కులను స్థానిక ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్.రాజు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజు మాట్లాడుతూ ఫ్యాక్టరీ ను అన్ని విధాల అభివృద్ది చేసేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం ఎం.డి. వి.సన్యాసినాయుడు మాట్లాడుతూ 2008 – 09 సీజన్ నుండి 2020-21 వరకు క్లెయిమ్ చేసిన 341 మంది సభ్య రైతులకు గాను 141 మందికి పరిహారం చెల్లించామన్నారు. మిగిలిన 200 మంది రైతు కుటుంబాలకు దశల వారీగా చెల్లిస్తామన్నారు. 2008-09 నుండి 16 సీజన్ ల నుండి సభ్య రైతులు వద్ద వసూళ్లు చేసిన మొత్తానికి అదనంగా రూ.3 దాకోట్ల 20 లక్షలు జత చేసి చెల్లించామన్నారు. 2021-22 సీజన్ నుండి 31.08.2023 వరకు 225 క్లెయిమ్ లు పెండింగ్ లో ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సి.డి.ఓ. కె.రామం, ఏ.ఓ లు ఎస్.నాగేశ్వరరావు, యూనియన్ నాయకులు కె.భాస్కర్, శరగడం రామునాయుడు, రాయి సూరిబాబు, సరకాన అప్పలనాయుడు, సుగర్స్ రైతు సభ్యుల కుటుంబాలు, రైతులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.