– ఏ.పి.రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు …
విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : ఉత్తరాంధ్రలో గల సాగునీటి ప్రాజెక్టులు అభివృద్ధిపై ప్రభుత్వం తక్షణమే అభివృద్ధి చర్యలు చేపట్టాలని ఏ.పీ. రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు డిమాండ్ చేశారు. ఈ నెల 22న అనకాపల్లిలో నిర్వహించనున్న రైతాంగ ప్రాంతీయ సదస్సు ను విజయవంతం చేయాలని రైతు సంఘం నేత రెడ్డిపల్లి కోరారు. కమ్యూనిస్టు అనుబంధ సంఘాల ముఖ్య నేతలతో గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డిపల్లి మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ప్రాంతాలైన విశాఖ ఉమ్మడి జిల్లాలు, శ్రీకాకుళం, విజయనగరం తదితర జిల్లాల్లో సుమారు 25000 సాగునీటి చెరువులు క్రింద 23.24 లక్షలు ఎకరాలు సారవంతమైన భూములుండగా, కేవలం 8 లక్షల ఎకరాలకు ఖరీఫ్ సీజన్ లో వర్షాధారంగా మాత్రమే పంటలు పండి0చాల్సి వస్తోందని అన్నారు. ఉత్తరాంధ్ర లో ఎన్ని సాగునీటి వనరులు వున్నప్పటికీ వాటి అభివృద్ది పై పాలకులు శ్రద్ద చూపకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి అన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, ప్రధాన చెరువులు, గెడ్డ తదితర సాగునీటి వనరులను అభివృద్ది చేస్తే రెండు పంటలు పండి సస్య శ్యామలం అవుతాయని తెలిపారు. అధికార కూటమి ప్రభుత్వం పెద్దలు, పాలకులు, ఇరిగేషన్ అధికారులు తక్షణమే ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులు అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏ.పి. చెరకు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేచలపు వెంకటరమణ (కాసుబాబు), మండల రైతు సంఘం కార్యదర్శి రొంగలి నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.