డిపో మేనేజర్ మోతిలాల్ నాయక్
విశాలాంధ్ర -ధర్మవరం : ధర్మవరం డిపోలో ఖాళీగా ఉండి వ్యాపారమునకు అనువైన దుకాణముల కొరకు టెండర్ నోటీసులు కోరడం జరుగుతుందని, డిపో మేనేజర్ మోతిలాల్ నాయక్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా బుధవారం వారు మాట్లాడుతూ ఈనెల 17వ తేదీ గురువారం జిల్లా ప్రజా రవాణా అధికార కార్యాలయం పుట్టపర్తి నందు మధ్యాహ్నం రెండు గంటలకు టెండర్ నిర్వహిస్తామని తెలిపారు. దాదాపు పది దుకాణములు ఉన్నవని, ఆసక్తిగల వ్యాపారుల నుండి టెండర్లను వేసుకొని అవకాశం ఉందని తెలిపారు. టెండర్ ఫారాలు ఈనెల నాలుగో తేదీ నుండి 16వ తేదీ వరకు ఉదయం 10:30 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు, ధర్మవరం డిపో మేనేజర్ కార్యాలయము నందు పని దినములలో టెండర్ ఫారములు విక్రయించబడునని తెలిపారు. కార్యాలయ పదివేలల్లో మాత్రమే టెండర్ ఫారాలు విక్రయించబడునని తెలిపారు. టెండర్ ఫారం ధర 885 రూపాయలు ఉంటుందన్నారు. ఈనెల 4వ తేదీ నుండి 16వ తేదీ వరకు ఉదయం 10:30 నుండి సాయంత్రం ఐదు గంటల లోపు డిపో మేనేజర్ ధర్మవరం వారి ఆఫీసు నందు పని దినములలో రెండు ఫారములు అమ్మబడును అని తెలిపారు. మరిన్ని వివరాలకు 9959225859 కు గాని, 7 3 8 2 8 6 0 9 4 7 2 గాని, 7382861410 లేదా 7382860501 కు సంప్రదించవచ్చు అని తెలిపారు.