విశాలాంధ్ర – ధర్మవరం : శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి లో నిర్వహించబడు గురు పూర్ణిమ వేడుకలకు సందర్భంగా ధర్మవరంలోని శ్రీ సత్య సాయి సేవా సమితి శ్రీ సత్యసాయి భజన మండలి ఆధ్వర్యంలో దాదాపు 50 మంది బాబా భక్త బృందం ఆదివారం ఉదయం ధర్మారం నుండి కాలినడకన బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా బాబా భక్తులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరము గురు పౌర్ణమి సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టడం మాకెంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కాలినడకన పాదయాత్ర నేటికీ 20 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. పుట్టపర్తి సత్యసాయి బాబా ప్రపంచవ్యాప్తంగా తన యొక్క సందేశాలను ఇవ్వడంతోనే నేడు భక్తాదుల సంఖ్య అధికం కావడం జరుగుతోందని తెలిపారు. పుట్టపర్తి బాబాను నమ్మిన వారికి అంతా మంచే జరుగుతోందని ఇందుకు నిదర్శనాలు కూడా ఎన్నో ఉన్నాయని తెలిపారు. తాము సోమవారం ఉదయానికి అంతా బాబా మందిరానికి చేరుకొని, అక్కడ మా కార్యక్రమాన్ని నిర్వహించి, తదుపరి ధర్మారానికి రావడం జరుగుతుందని వారు తెలిపారు. తొలుత ధర్మవరం లోని పాండురంగ స్వామి దేవాలయంలో బాబాను పల్లకి ద్వారా పట్టణ ప్రధాన కూడలిలో ఊరేగిస్తూ, స్వామివారి భక్తి గీతాలను ఆలపించారు. ఈ కార్యక్రమంలో నామా రామా ప్రసాద్, కాకి చంద్రశేఖర్, రామకృష్ణ, సాంబశివుడు, లక్ష్మీనారాయణ, చౌడమ్మ, శివమ్మ, లక్ష్మీదేవితో పాటు అధిక సంఖ్యలో బాబా భక్తాదులు పాల్గొన్నారు