అసిస్టెంట్ రీజనల్ కోఆర్డినేటర్.. శ్రీరామమూర్తి
విశాలాంధ్ర – ధర్మవరం : ప్రజాసేవలో రోటరీ క్లబ్ ఎల్లప్పుడూ ముందు ఉండాలని, తద్వారా క్లబ్బుకు మంచి గుర్తింపు తెచ్చేలా అందరూ కృషి చేయాలని ముఖ్య అతిథులు, అసిస్టెంట్ రీజనల్ కోఆర్డినేటర్ కె. శ్రీరామమూర్తి, అసిస్టెంట్ గవర్నర్ తిమ్మారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా శనివారం రాత్రి నూతన రోటరీ క్లబ్ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఇప్పటికే దేశ స్థాయిలో రోటరీ క్లబ్ కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని, అందులో ధర్మవరం రోటరీ క్లబ్ మరింత గుర్తింపు తెచ్చుకోవడం, మాకెంతో సంతోషంగా, గర్వంగా ఉందని తెలిపారు. ప్రజలకు అవసరమయ్యే కార్యక్రమాలను సేవాభావంతో చేసినప్పుడే నిజమైన సంతృప్తి ఉంటుందని తెలిపారు. అనంతరం ముఖ్య అతిథులు నూతన కమిటీగా ఎంపికైన అధ్యక్షులు డి. జయసింహ, కార్యదర్శిగా డి. నాగభూషణ, కోశాధికారిగా వై. సుదర్శన గుప్తాల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఇందులో భాగంగానే రోటరీ క్లబ్బుకు అనుబంధ సంస్థలైన ఇన్నర్ వీర్ క్లబ్లో కూడా నూతన కమిటీగా అధ్యక్షులుగా గట్టు నాగరత్న, కార్యదర్శిగా కే. ఆదిలక్ష్మి, కోశాధికారిగా బి. భాగ్యలక్ష్మి ముఖ్యఅతిథిగా విచ్చేసిన పాస్ట్ జిల్లా చైర్మన్ వనజ మోహన్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. రోటరీ క్లబ్ టీంమెంబర్గా సత్రశాల ప్రసన్నకుమార్, వెంకటేశులు, సహకార దర్శి- గట్టు హరి సర్జంట్ అట్ ఆర్మ్స్- పెద్దారెడ్డి, అడ్వైజరీ కమిటీగా 6 మంది తమ సహాయ సహకారాలను అందించినప్పుడే, రోటరీ క్లబ్ యొక్క కార్యక్రమాలు విజయవంతం అవుతాయని తెలిపారు. అనంతరం ముఖ్య అతిథులను రోటరీ క్లబ్ కమిటీ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సత్రశాల ప్రసన్నకుమార్, కె. శ్రీనివాసులు రెడ్డి, బండారు చలం, టి. రత్నశేఖర్ రెడ్డి, జి. కొండయ్య, పి. కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.