విశాలాంధ్ర – ధర్మవరం:: పట్టణంలోని కొత్తపేటలో గల మెడ్ ప్లస్ మందుల షాపును జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మెడికల్ ప్లస్ యాజమాన్యం వారు చిలక మధుసూదన్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. తదుపరి దేవుని చిత్రపటాలకు పూలు వేసి, పూజలు చేయించారు. అనంతరం చిలకం మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ధర్మవరంలో మూడో బ్రాంచ్ మెడ్ ప్లస్ మెడికల్ స్టోర్ ప్రారంభం పట్ల తనకెంతో సంతోషంగా ఉందని, ఇప్పటికే పట్టణంలో ఈ మెడికల్ షాపుకు మంచి గుర్తింపు ప్రజల ద్వారా లభించిందని తెలిపారు. రాయితీతో కూడిన మందులు కూడా లభించడం పేదలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని తెలిపారు. గతంలో మందులు కావాలి అంటే కర్నూల్, అనంతపురం, బెంగళూరుకు వెళ్లే వాళ్ళని, ఇప్పుడు ఏ మందులు కావాలన్నా కూడా మెడ్ ప్లస్ లో దొరకడం ధర్మవరం ప్రజల యొక్క అదృష్టం అని తెలిపారు. వీరి వ్యాపారం దినదిన అభివృద్ధి చెందాలని వారు ఆశా భావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మెడ్ ప్లస్ యాజమాన్యం, సిబ్బంది, జనసేన, తెలుగుదేశం పార్టీల నాయకులు, కార్యకర్తలు, కొత్తపేట ప్రజలు పాల్గొన్నారు.