Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

దళితుల సమస్యలపై పోరాడండి

ఎమ్మార్పీఎస్‌ జిల్లా అధ్యక్షులు ఏం.రాజు
విశాలాంధ్ర` ఉరవకొండ :
అనంతపురం జిల్లాలో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలపై వారికి అండగా ఉంటూ పోరాటాలను నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని.ఎమ్మార్పీఎస్‌ జిల్లా అధ్యక్షులు ( దండోరా) ఎం రాజు, జిల్లా కార్యదర్శి కౌకుంట్ల రవి అన్నారు. ఉరవకొండ నియోజకవర్గం ఎంఆర్పిఎస్‌ సమావేశాన్ని సోమవారం ఉరవకొండలో స్థానిక రోడ్లు భవనాల అతిథి గృహంలో లో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో అనేక ప్రాంతాల్లో దళితులపై దాడులు జరుగుతున్నప్పటికీ ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులను నమోదు కావడం లేదని వారు పేర్కొన్నారు. స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటికీ దళితులపై దాడులు అంటరానితనం కొనసాగడం దురదృష్టకరమన్నారు. వీటన్నింటిపై కూడా ఎమ్మార్పీఎస్‌ పోరాటాలను నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం నియోజకవర్గ ఎంఆర్పిఎస్‌ కమిటీని ఏకగ్రీవంగా ఎందుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా గంగాధర్‌ అధ్యక్షులుగా చెన్నప్ప ఉపాధ్యక్షులు ఎం రామన్న, సురేష్‌ ప్రధాన కార్యదర్శిగా డి. ఓబయ్య, వజ్రకరూరు అధ్యక్షులుగా ఎన్‌. కిరణ్‌ తాలూకా కార్యవర్గ సభ్యులుగా ఆనంద్‌, అశోక్‌, శివప్ప రాజేంద్ర బాబు,ను ఎంపిక చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img