విశాలాంధ్ర` ధర్మవరం: మండల పరిధిలోని దర్శనమల కెనరా బ్యాంక్ 117 వ వార్షికోత్సవం సందర్భంగా బ్యాంకు ఆధ్వర్యంలో పట్టణంలోని కొత్తపేటలో గల మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాలలో 5, 6, 7, 8, 9, 10 తరగతిలో చదువులో మంచి ప్రతిభ కలిగిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కెనరా విద్యా జ్యోతి పథకం ద్వారా మెరిట్ స్కాలర్షిప్ చెక్కులను మేనేజర్ దినేష్, పాఠశాల హెచ్ఎం మేరీ వర కుమారి విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్ దినేష్ మాట్లాడుతూ మా కెనరా బ్యాంక్ 117వ వార్షికోత్సవం సందర్భంగా ఎస్సీ ఎస్టీ కులంలో మంచి ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు అనగా 8వ, 9వ, 10వ తరగతిలో ఒక్కొక్కరికి ఐదువేల రూపాయలు, ఐదవ, ఆరవ, ఏడవ తరగతిలో ఒక్కొక్కరికి 2000 రూపాయల చొప్పున అందజేయడం జరిగిందన్నారు. ప్రతి సంవత్సరము ఈ పాఠశాలకే స్కాలర్షిప్లను మున్ముందు కూడా ఇవ్వడం జరుగుతుందని వారు తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు, స్కాలర్షిప్ పొందిన విద్యార్థినీలు, హెచ్ఎం తో పాటు ఉపాధ్యాయులు శారద, కరుణ ,పూజారి రమేష్, ఆదినారాయణ, రాము కెనరా బ్యాంక్ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్ హారిక, బ్యాంకు సిబ్బంది హరినాథ్ రెడ్డి, మారుతి, గోపి తదితరులు పాల్గొన్నారు.