విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని గుట్ట కింద పల్లి లో గల ఏపీ మోడల్ స్కూల్లో 2022-23 సంవత్సరానికి గాను 9 మంది విద్యార్థులు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ పద్మశ్రీ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ప్రణవి, రమ్యకుమారి, స్వాతి, సహనాజ్, కీర్తన భాయి, మౌక్తిక, మను శ్రీ, జాన్ మోహే, వరుణ్ సందేశ్ ఎంపిక కావడం జరిగిందన్నారు. మా పాఠశాల తరఫున ఎన్ఎంఎంఎస్ అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, స్కాలర్షిప్ కు ఎంపికైన విద్యార్థులకు ఈ ఏడాది నుంచి, ప్రతి సంవత్సరం 12 వేల రూపాయల చొప్పున నాలుగు సంవత్సరాల పాటు ఉపకార వేతనం లభిస్తుందని తెలిపారు. అనంతరం ప్రిన్సిపాల్ తో పాటు ఉపాధ్యాయులు బోధనేతర సిబ్బంది తోటి విద్యార్థులు అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.