విశాలాంధ్ర – ఉరవకొండ : ఉరవకొండలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలలుపై చర్యలు తీసుకోవాలని ఎస్సీ జన సంఘం నియోజకవర్గం అధ్యక్షులు స్వర్ణ సాగర్ పేర్కొన్నారు.సోమవారం ఎస్సీ జన సంఘం స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉరవకొండలోని ఎంఈఓ కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలను అతిక్రమిస్తూ ప్రైవేట్ కళాశాలలు ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నారన్నారు. అంతేకాకుండా పాఠశాలల్లోనే విద్యార్థులకు పుస్తకాలు అధిక రేట్లకు అమ్ముతున్న సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరగతుల వారీగా ఫీజుల వివరాలను ప్రతి ప్రైవేట్ పాఠశాలలో బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్ జె ఎస్ ఎఫ్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శులు హరీష్,సుధాకర్,కమిటీ సభ్యులు యశ్వంత్,రాయుడు తదితరులు పాల్గొన్నారు.