అనంతపురం జిల్లా
-ఐసీడీఎస్ సీడీపీఓ ధనలక్ష్మి
విశాలాంధ్ర-రాప్తాడు : సమాజంలో కిశోర బాలికలు నెలవారీ ఋతుక్రమంపై అవగాహన కలిగి ఉండడం వల్ల అనారోగ్య సమస్యలు దరిచేరవని ఐసీడీఎస్ సీడీపీఓ ధనలక్ష్మి సూచించారు.
శనివారం రాప్తాడు మండల కేంద్రంలో కిషోర బాలికల మాసిక మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.
సిడిపిఓ మాట్లాడుతూ కిశోర బాలికలను తప్పనిసరిగా చదివించాలన్నారు. రోజూ మంచి సమతుల ఆహారం, ఋతుక్రమ సమయంలో మంచి శక్తినిచ్చే ఆహార పదార్థాలను తీసుకోవాలన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత తప్పక పాటించాలన్నారు. తల్లిదండ్రులు బాల్యవివాహాలు చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలను వివరించారు. సిహెచ్ఓ శివ ప్రసాద్ మాట్లాడుతూ కిశోర బాలికలు సరైన పౌష్టికాహారం తీసుకోవడం వల్ల రక్తహీనత తలెత్తదన్నారు. అప్పుడప్పుడు ఐరన్ టాబ్లెట్లు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి సూపర్వైజర్ నాగరత్న, హేమలత, ఏఎన్ఎం అనిత, అంగన్వాడి టీచర్లు, ఆయాలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.