జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్
విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో సోమవారం నిర్వహించిన జగనన్నకు చెబుదాం, స్పందన గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ అర్జీలను స్వీకరించారు.
ప్రజల నుంచి అర్జీలను స్వీకరించే కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్ మేఘస్వరూప్, జిల్లా పరిషత్ సీఈవో వైఖోమ్ నిదియా దేవి, డిప్యూటీ కలెక్టర్లు ఆనంద్, నీలమయ్య, సమగ్ర శిక్ష ఏపిసి వరప్రసాద్, టూరిజం రీజనల్ డైరెక్టర్ వెంకటరమణమ్మ, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి 289 అర్జీలను జాయింట్ కలెక్టర్ స్వీకరించడం జరిగింది.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జగనన్నకు చెబుదాం, స్పందన అర్జీలకు త్వరితగతిన పరిష్కారం చూపించాలని అధికారులను ఆదేశించారు. అర్జీలను సకాలంలో నాణ్యతగా పరిష్కరించాలని, అర్జీల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వరాదన్నారు. గడువులోపు అర్జీలను నిత్యం మానిటర్ చేస్తూ పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా శాఖల జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించి అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సూపరింటెండెంట్ లు, తదితరులు పాల్గొన్నారు.