విశాలాంధ్ర – అనంతపురం : జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ ఐఏఎస్ అనంతపురం వారి ఆదేశానుసారం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్.కె.యస్ యస్. వెంకటేశ్వరరావు మరియు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఈబీదేవి ఆధ్వర్యంలో ప్రోగ్రామ్ ఆఫీసర్ రాష్ట్రీయ బాల స్వస్థయ కార్యక్రమం- తరిత చికిత్స కేంద్రం ప్రోగ్రాంలో భాగంగా ఆటిష్టిక్ ప్రైడ్ డే కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ శ్రీ కేతన్ గార్గ్ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ… మానసిక పరిపక్వత లోపం కలిగిన పిల్లల కోసం జిల్లా త్వరిత చికిత్సా కేంద్రం నందు అనేక విభాగాలుగా పుట్టుకతో లోపం ఉన్న పిల్లలందరికీ చికిత్సలు అందిస్తూ ఎంతో మంది పిల్లలను సాధారణ పిల్లలుగా తీసుకురావడం అభినందనీయమన్నారు.
ఈ కార్యక్రమం జిల్లా లోని ప్రతి మారు మూల గ్రామానికి తెలియాలి అన్నారు.
తదుపరి ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మాణిక్య రావ్ మాట్లాడుతూ… ఆటిజం పిల్లలకు తల్లిదండ్రులు సరైన శ్రద్ధ తీసుకొని ఎక్కువ సమయము పిల్లలతో పిల్లలకు కేటాయించాలి. పిల్లలకు ఇష్టమైన క్రీడల పట్ల మరియు విద్య పట్ల తల్లిదండ్రులు శ్రద్ధ వహించి ప్రోత్సహించాలన్నారు. తద్వారా పిల్లలు మానసికంగా శారీరకంగా మంచి ఎదుగుదల కనపరుస్తారు.
ఎంతోమంది ఆటిజం పిల్లలు నేడు మానసిక పరిపక్వత చెంది సమాజంలో భాగస్వాములై అన్ని రంగాలలో ముందుకెళ్తున్నారు అన్నారు.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఈబీదేవి మాట్లాడుతూ… డీఈఐసి సిబ్బంది పుట్టుకతో లోపం తో వచ్చు అనేక మంది పిల్లలకు మెడికల్ చికిత్సలు, థెరపీ మరియు శస్త్ర చికిత్సలు అవసరమైన పరికరాలు ఆట వస్తువులు ఇచ్చి అనేక మంది పిల్లలకు మంచి సేవలందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో గుండె కన్ను ముక్కు చెవి నోరు లోపంతో పుట్టిన పిల్లలకు శాస్త్ర చికిత్సలు మరియు వినికిడి పరికరాలు పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. అవసరమైన పిల్లలకు ఎం ఆర్ కిట్స్, ఉచితంగా ఇవ్వడం జరిగినది.
ఆసుపత్రి సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ… సైకియాట్రి ఈఎన్టి పీడియాట్రిక్ సర్జరీ తదితర విభాగాలతో కలిసి డి ఈ ఐ సి సిబ్బంది ఈ ఆటిజం పిల్లలకు చికిత్సలు అందించడం చాలా గర్వకారణం అన్నారు. మొత్తం 2017 జూలై నెల నుంచి 2024 జూన్ వరకు మొత్తం 949 న్యూ కేసులు చికిత్సలు పొందుతున్నారు. అందులో ఇప్పటివరకు 548 మంది పిల్లలు ఆటిజం నుంచి బిహేవియర్ మోడిఫికేషన్ థెరపీ ద్వారా రికవరీ అయ్యారు అని తెలిపారు . మిగతా పిల్లలు ఫాలో అప్ ట్రీట్మెంట్ లో ఉన్నారు అని పేర్కొన్నారు. ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ జి నారాయణస్వామి మాట్లాడుతూ… ఆటిజం పిల్లలను తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించి వారికి తగిన విద్యాబుద్ధులు నేర్పించాలని అన్నారు. జిల్లాలోని ప్రతి పుట్టుకతో వచ్చు లోపాలు గల పిల్లలందరూ డిఇ ఐసి సెంటర్ కి వచ్చి చికిత్స తీసుకొని రికవరీ కావాలన్నారు.
ఈ కార్యక్రమానికి ఆర్ఎంవోలు డాక్టర్. పద్మజ, ,హేమలత,సునిత, ఆచార్యులు డాక్టర్ రవికుమార్ చిన్న పిల్లల వైద్యులు, డాక్టర్ వైద్యనాథ్ మానసిక వైద్య విభాగం డాక్టర్ రామస్వామి నాయక్, శస్త్ర చికిత్స విభాగము, అలాగే జి జి హెచ్ సిబ్బంది, డీఈఐసి జిల్లా మేనేజర్ రజిత, పీడియాట్రీషియన్ శ్రీవిద్య, క్లినికల్ సైకాలజిస్ట్ సుందర రావు,, స్పీచ్ తెరపిస్ట్ గీత,ఆప్టోమెట్రీస్ట్ జ్ఞాన ప్రసన్న స్పెషల్ ఎడ్యుకేటర్ చంద్రకళ, సిబ్బంది పాల్గొన్నారు