Monday, May 20, 2024
Monday, May 20, 2024

పాలిసెట్ ర్యాంకర్లకు అవగాహన కార్యక్రమం…

ప్రిన్సిపాల్ జేవి.సురేష్ బాబు
విశాలాంధ్ర -ధర్మవరం : సాంకేతిక విద్యాశాఖ సంచాలకుల ఆదేశానుసారం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ నెల 12వ తేదీ నుంచి 20 నాలుగవ తేదీ వరకు ఉదయం పదిగంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పాలిసెట్టు ర్యాంకర్లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ జేవి.సురేష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమం రెండు వారాలపాటు ఉంటుందని ప్రతిరోజు నిపుణులచే పాలిటెక్నిక్ విద్య ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు వివిధ రకాల సౌకర్యాలు మొదలగు వాటి మీద అవగాహన కల్పించబడుతుందని తెలిపారు. కావున పాలిసెట్ ర్యాంకర్లు అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img