విశాలాంధ్ర – రాప్తాడు : మండలంలో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతర కృషి చేస్తున్నామని ఎంపీపీ చిట్రెడ్డి జయలక్ష్మి అన్నారు. రాప్తాడు ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం సర్వసభ్య సమావేశాన్ని ఎంపీపీ జయలక్ష్మి అధ్యక్షతన నిర్వహించారు. మండల అధికారులు తమ ప్రగతి నివేదికలను చదివి వినిపించారు. ఎంపీపీ మాట్లాడుతూ గ్రామాలలో వర్షాలకు ఎక్కడైనా రోడ్లు, డ్రైనేజీలు దెబ్బతిని ఉంటే అధికారులు స్పందించి మరమ్మత్తులు చేయాలన్నారు. ప్రతిపక్ష సభ్యులు విమర్శించడం మాని గ్రామాల అభిృద్ధికి సహకరించాలన్నారు. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాలు ప్రజా సమస్యలు పరిష్కరించాలని అధికారులకు సూచించారు. పంచాయతీ కార్యదర్సులు, సర్పంచులు గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ నిరంతరం చేపట్టాలన్నారు. మురుగుకాలువలు, ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పసుపుల హేమావతి, వైస్ ఎంపీపీలు రామాంజి, వరలక్ష్మి, ఎంపీడీఓ సాల్మన్, ఈఓఆర్డీ మాధవి, ఏఓ రత్నాబాయి తదితరులు పాల్గొన్నారు.