విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణములోని పార్థసారధి నగర్ లో నివాసముంటున్న ఎర్రజోడు సోమశేఖర్ శుక్రవారం రైలు ప్రమాదంలో మృతి చెందాడు. మృతి చెందిన కుటుంబం చాలా పేద కుటుంబమని తెలుసుకొని ఆ వార్డు కౌన్సిలర్ గోరకాటి పురుషోత్తం రెడ్డి అంత్యక్రియలకు గాను ఐదువేల రూపాయల నగదును ఇస్తూ, తన దాతృత్వమును చాటుకున్నారు. అనంతరం గోర కాటి పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ ప్రతి వ్యక్తి పేద వాళ్లకు ఏదో ఒక రూపాయి నా సహాయాన్ని అందించినప్పుడే మానవతా విలువలు పెరుగుతాయని, సమాజంలో మంచి వ్యక్తిగా గుర్తింపబడుతాడని తెలిపారు. తన వార్డులో పేదవాళ్లకు గాని,శుభ, అశుభ,ప్రమాదము తదితర కార్యక్రమాలకు తన వంతుగా సహాయాన్ని అందించే దిశలో ఎల్లప్పుడూ ఉంటానని తెలిపారు.