ఏఐఎస్ఎఫ్ డిమాండ్..
విశాలాంధ్ర – జె ఎన్ టి యుఏ : ఎస్ఆర్ఐటి ఇంజనీరింగ్ కళాశాలలో వసతి గృహంలో ఉన్న విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కావడంతో అమరావతి హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కుల్లాయి స్వామి, కార్యదర్శి చిరంజీవి పేర్కొన్నారు. ఫుడ్ పాయిజన్ కారణమైన కళాశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసులను నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పుడ్ పాయిజన్ 100 మందికి పైగా జరుగుతే కేవలం 33 మంది విద్యార్థులకు మాత్రమే వైద్య సేవలు అందజేయడం పట్ల యాజమాన్యం, డీఎంహెచ్వో బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. అత్యధిక ఫీజులు వసూలు చేస్తారు కానీ విద్యార్థులకు అందిస్తున్న సేవలలో మాత్రం నిర్లక్ష్య వైఖరికి ఇదే నిదర్శనం అని అన్నారు.