జిల్లా కార్యదర్శి గౌతమ్ కుమార్
విశాలాంధ్ర -ఉరవకొండ : జనసేన రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై .విశ్వేశ్వర్ రెడ్డి మరియు ఎమ్మెల్సీ పోతుల సునీత విమర్శలు చేయడం తగదని దీనిని తాము తీవ్రంగ ఖండిస్తున్నట్లు అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి గౌతమ్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం ఉరవకొండలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ చేస్తున్న వారాహి విజయ యాత్ర కి ప్రజల నుండి మంచి ఆదరణ రావటంతో ఒర్వలేక మాట్లడటం సరికాదన్నారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రజల డైరెక్షన్ లో నడిచే నాయకుడు అని మీ నాయకునిలాగా ఐ ప్యాక్ డైరెక్షన్ లో నడిచే వ్యక్తి కాదని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ గురించి ఆలోచించడం మానేసి నియొజకవర్గ అభివృద్ది కోసం పొటీ పడితే బాగుంటుందని మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డికి హితువు పలికారు. పోతుల సునీత కి పవన్ కళ్యాణ్ విమర్శించేంత అర్హత లేదన్నారు. ప్యాకెజీ కోసం ,పదవుల కోసం పార్టీలు మారే పోతుల సునీత రాబోయే ఎన్నికలలో ఏ పార్టీలో ఉంటుందో ప్రజలకి సమాధానం చెప్పాలన్నారు. బాధ్యతగల రాష్ట్ర మహిళా అధ్యక్షరాలి పదవిలో ఉన్న పోతుల సునీత ముందు ప్రజాస్వామ్య భాషను నేర్చుకోవాలని హితువు పలికారు. వైసిపి ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే వున్నాయని ఈ విషయాన్ని వై .విశ్వేశ్వర్ రెడ్డి పోతుల సునీత గుర్తించాలన్నారు