ప్రైవేటు పాఠశాల పై చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న గుంతకల్లు ఎంఈఓ కుళ్లాయప్ప…
విశాలాంధ్ర-గుంతకల్లు : వేలకు వేలు ఫీజులు విద్యార్థుల తల్లిదండ్రులతో వసూలు చేసి దోచు కున్న డబ్బుతో కోట్లు విలువచేసే స్థలాలు కొంటారు గాని విద్యార్థుల ఆరోగ్యానికి అవరోధాలు కలిగించే పరిస్థితి నెలకొంది.అయితే గుంతకల్లు పట్టణంలో సెయింట్ పీటర్ స్కూల్ లో చదివించాలంటే మరో కార్పోరెట్ స్కూల్ గా మారింది.అనేక ప్రభుత్వ నిబందనలు లేకున్న నేను మాత్రం కార్పోరెట్ విధ్య అందిస్తునా అని డంబాచారం చేస్తున్నారు.కనీసం స్కూలు ఆవరంలో చూస్తే టాయిలెట్ల నిర్వహణ కానీ ఏ మాత్రం పట్టించుకోరు. విద్య వ్యాపార నిర్వహణ గానే చూస్తున్నారు.స్కూలు యాజమానికి సామాజిక బాధ్యతగా ఎవరు తీసుకోవడం లేదు కేవలం తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి విద్యనందించవలెనన్న బలహీనతే వారి పాలిట శాపం గా మారింది.తల్లితండ్రులు మంచి చదువు చదివించుకోవాలని కోరికని స్కూలు యజమానులు తల్లి తండ్రుల బలహీనతని ఆసరాగా తీసుకుంటున్నారు. ఏమాత్రం పాఠశాల పరిసర ప్రాంతాలు పట్టించుకోకుండా విధ్యార్థుల ఆరోగ్యాలతో చలగాటం ఆడుతున్నారు.అద్దంలో ఆకాశాన్ని చూపించా అన్న చందాగా ఒక విద్యా సంస్థ నిర్వహణ కొన సాగుతుంది. 20 సంవత్సరాల క్రితం ఒక క్రిస్టియన్ పేరుమీద ప్రారంభమైన విద్యాసంస్థ నిర్వాహకులు మారిన పేరుభలంతో ఏటా లక్షలు పోగేసుకుంటున్నారు. యాజమాన్యం కేవలం సంవత్సరంలో ఒకసారి మాత్రమే స్కూలును సందర్శిస్తూ ఫీజులు కట్టలేని తల్లిదండ్రులను దుర్భాషలాడుతూ వేధిస్తూ వారి నెత్తురు తాగుతున్నారు. ఒక్క శాతం కూడా తగ్గించుకునేది లేదని మేము అధికారులకు ఇచ్చిపుచ్చుకునేటివి చాలా ఉంటాయని మొహమాటం లేకుండా చెప్పేస్తున్నారు. గుంతకల్లులోని ప్రైవేటు విద్యా సంస్థలు మరీ దారుణంగా తయారయ్యాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేట్ సంస్థలకు ఏమాత్రం తీసిపోకుండా కొన్ని విద్యాసంస్థలు ప్రభుత్వ నిబంధనలకు పాత రేసి నిలువు దోపిడీ చేస్తున్నారు. నేటి ప్రభుత్వం విద్యను ఒక సామాజిక హక్కుగా మార్చి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం విద్య బోధన చేసే విధంగా ఉపాధ్యాయులకు తర్ఫీదు నిస్తూ మౌలిక వసతులు టాయిలెట్లు పౌష్టికాహారం నాడు నేడు క్రింద ఎంతో అభివృద్ధి చేసి సంకల్పంతో ముందుకెళుతునప్పటికి ప్రభుత్వ స్కూళ్లకు తల్లిదండ్రులు విద్యార్థినీలను వదలాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. ఉచితంగా ప్రభుత్వం విద్యని అందిస్తుంటే కొంతమంది కామాంధులుగా తయారైన ఉపాధ్యాయులు విద్యార్థినిలను టార్గెట్ చేసుకొని అసభ్యకర వేధింపులకు గురిచేయడం జరుగుతున్నాయన్న ఉద్దేశంతో తల్లిదండ్రులు ప్రభుత్వ స్కూళ్లకు పంపించకుండా ప్రైవేట్ స్కూళ్లకు మొగ్గు చూపుతున్నారు.