సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ
విశాలాంధ్ర – అనంతపురం : అనంతపురం జిల్లా సిపిఐ సీనియర్ నాయకులు, ఎస్టియు నాయకులు పి. లక్ష్మన్న మరణంపట్ల సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రగాఢ సంతాపం తెలిపారు.
ఈ మేరకు కె రామకృష్ణ శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత కమ్యూనిస్టు పార్టీ, అనంతపురం జిల్లా సీనియర్ నాయకులుగా, స్టేట్ టీచర్స్ యూనియన్ నాయకులుగా టీచర్ పి. లక్ష్మన్న తాను నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేశారన్నారు. నీతి, నిజాయితీలకు నిలువుటద్దంగా, నిబద్ధతకు మారుపేరుగా ఆయన నిలిచారన్నారు. కుందుర్పి మండల కేంద్రంలో కమ్యూనిస్టు పార్టీ ఉన్నతికి లక్ష్మన్న ఎంతో కృషి చేశారన్నారు.
విశ్రాంత ఉపాధ్యాయులు పి. లక్ష్మన్న మరణంపట్ల సిపిఐ రాష్ట్ర సమితి తరఫున ప్రగాఢ సంతాపాన్ని, ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు.