విశాలాంధ్ర – జేఎన్టీయూఏ : కలుషిత ఆహారం తో 33 మంది విద్యార్థులు అమరావతి హాస్పిటల్ చికిత్స కు కారణమైన ఎస్ఆర్ఐటి ఇంజనీరింగ్ కళాశాల గుర్తింపును ఉన్నత విద్యాశాఖ, విశ్వవిద్యాలయం రద్దు చేయాలని అనంతపురం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట ఏఐఎస్ఎఫ్ అధ్యక్షుడు కుల్లాయి స్వామి , ఎస్ఎఫ్ఐ చంద్ర , ఏఐఎస్బి జిల్లా కార్యదర్శి పృథ్వి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. విద్యార్థులతో లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న నాణ్యమైన ఆహారం అందించడంలో నిర్లక్ష్య వైఖరికి ఇదే నిదర్శనమని అన్నారు. డి ఎం హెచ్ ఓ, ఉన్నత విద్యాశాఖ నిష్పక్షపాతంగా విచారణ చేయాలని కోరారు. వసతి గృహంలో ఉంటున్న విద్యార్థులకు 56 మంది డాక్టర్లను పంపించి వైద్య సేవలను అందిస్తూ డి ఎం హెచ్ ఓ పర్యవేక్షిస్తూ వాస్తవిక విషయాలను వెల్లడించకుండా గోప్యంగా ఉంచుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర ఆర్గనైజేషన్ కార్యదర్శి ఉమా మహేష్, వంశి, ఆనంద్ , మంజు, నారాయణస్వామి పాల్గొన్నారు.