ఏ పి చేతివృత్తదారుల సమాఖ్య కార్యనిర్వహక అధ్యక్షులు సి.లింగమయ్య పిలుపు
విశాలాంధ్ర -అనంతపురం : ఈనెల22వ బీసీ కార్పొరేషన్ దగ్గర ఉదయం 11 గంటలకు ధర్నా ను జయప్రదం చేయాలని ఏపీ చేతి వృత్తిదారుల సమాఖ్య కార్యనిర్వాహక అధ్యక్షులు సి. లింగమయ్య పిలుపునిచ్చారు. గురువారం నీలం రాజశేఖర్ రెడ్డి కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ చేతి వృత్తిదారుల సమాఖ్య సమావేశాన్ని నిర్వహించి కరపత్రాలను విడుదల చేశారు. . ఈ సమావేశం లో ఆంధ్రప్రదేశ్ చేతి వృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర కార్యనిర్వక అధ్యక్షులు సి లింగమయ్య మాట్లాడుతూ… బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కార్పొరేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలన్నారు. గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలలో కార్పొరేషన్లకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు ఇవ్వకుండా చేతి వృత్తిదారులందరినీ నిరాశకు గురి చేయడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం వంద రోజులు అవుతున్న ఇంతవరకు కార్పొరేషన్లకు నిధులు ఇవ్వడం లేదు అణగారిన వర్గాలకు 50 ఏళ్లు పైబడిన వాళ్లకు పింఛన్ ఇస్తామని ఇంతవరకు రావడం లేదన్నారు. పింఛన్ వెంటనే అమలు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిచంద్రబాబు నాయుడు కార్పొరేషన్లు నిధులు ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వము కార్పోరేషన్లకు నిదులిచ్చి చేతి వృత్తిదారులు అందర్నీ ఆదుకోవాల్సిందిగా కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గొర్ల మేకల పెంపకదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి పోతులయ్య, చేతి వృత్తిదారుల సమాఖ్య జిల్లా కార్యదర్శి సివి హరి కృష్ణ, స్వర్ణకార సంఘం జిల్లా అధ్యక్షులు బంగారు భాష, నాయి బ్రాహ్మణ వృత్తిదారుల సమాఖ్య నగర అధ్యక్షులు గోవిందరాజులు, రజక వృత్తి దారుల సమాఖ్య జిల్లా ఉపాధ్యక్షులు సి. నాగప్ప, రజక వృత్తిదారుల సమాఖ్య జిల్లా సహాయ కార్యదర్శి సి ఆదినారాయణ,నగర గౌరవ అధ్యక్షులు ఈశ్వరమ్మ, నగర వర్కింగ్ ప్రెసిడెంట్ నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.