విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో దాదాపు ఐదు సంవత్సరాల వరకు వైద్యులుగా పట్టణ ప్రజలకు సేవలు అందించడం అనన్యమైనదని ప్రభుత్వ ఆసుపత్రి ఎఫ్ఎసి. సూపర్డెంట్ డాక్టర్ నజీర్ పేర్కొన్నారు. తదుపరి వారు మాట్లాడుతూ దాదాపు 3-5 సంవత్సరాల వరకు ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలు అందించడం, మంచి గుర్తింపు తెచ్చుకోవడం సంతోషదాయకమన్నారు. వైద్యులు జయప్రకాశ్ రెడ్డి, ఉమాదేవి, సాధారణ బదిలీ పై కృష్ణాజిల్లా నందిగామకు, డాక్టర్ మాధవి చెన్నై కొత్తపల్లి కు, డాక్టర్ ఇందురేఖ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా అనంతపురం ప్రభుత్వ మెడికల్ కాలేజీకి పదోన్నతి పై బదిలీ కావడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ప్రభుత్వ ఆసుపత్రి సమావేశపు కార్యాలయంలో బదిలీపై వెళ్లిన వీరందరికీ వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి వైద్యుడు తన సేవలను సేవాభావంతో రోగులకు అంకితం చేసినప్పుడే మంచి గుర్తింపు లభిస్తుందని తెలిపారు. అనంతరం బదిలీపై వెళ్లిన వైద్యులను ఇంచార్జ్ సూపర్డెంట్ డాక్టర్ నజీర్ తో పాటు, సివిల్ సర్జన్ డాక్టర్ పద్మలత, వైద్యులు సురేఖ, నివేదిత, వైష్ణవి, కిరణ్, బాలాజీ, ఏశీ.ఉదయ్ కుమార్, నర్సింగ్ సూపర్డెంట్ రమాదేవి, ఆసుపత్రి సిబ్బంది తదితరులు ఘనంగా శాల్వాలతో సత్కరించారు.