అంగన్వాడి సూపర్వైజర్ జయమ్మ
విశాలాంధ్ర -తనకల్లు : ప్రతి ఒక్క విద్యార్థినీ విద్యార్థులను పట్టభద్రుడుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని అంగన్వాడి సూపర్వైజర్ జయమ్మ సూచించారు.మండల కేంద్రంలోని నాలుగవ అంగన్వాడీ కేంద్రంలో సోమవారం సూపర్వైజర్ జయమ్మ ఆధ్వర్యంలో గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి కేంద్రంలో ఐదు సంవత్సరములు నిండిన పిల్లలు పూర్వ, లిఖిత, గణిత, పటన స్థాయి ముగించుకొని ప్రాథమిక పాఠశాలలో చేర్పించవలసిన ఆవశ్యకతను తల్లిదండ్రులకు తెలియజేస్తూ పూర్వ ప్రాథమిక విద్య సర్టిఫికెట్ ను తల్లిదండ్రులకు అందజేస్తూ పిల్లలను ప్రాథమిక పాఠశాలలో చేర్పించి దీని ప్రాముఖ్యతను తల్లిదండ్రులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తనకల్లు లోనే అంగన్వాడి కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.