విశాలాంధ్ర – ధర్మవరం:: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ఇటీవల ప్రమాణస్వీకారం చేసిన రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమం, వైద్య విద్యా శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మంగళవారం మొదటిసారిగా శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం కి మంత్రి సత్య కుమార్ విచ్చేశారు.ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి వర్యులకు బత్తలపల్లి మండలము ఎర్రయ పల్లి దగ్గర నుంచి ప్రజలు అశేష సంఖ్యలో జిల్లా వ్యాప్తంగా హాజరై, రోడ్డు ఇరువైపులా బారులు తీరి మంత్రికి ఘన స్వాగతం పలికారు. క్రేన్ ద్వారా భారీ గజమాలల తో ప్రజలు స్వాగతించారు. ఇసుక వేస్తే రాలనంత జనం హాజరై డప్పు వాయిద్యాలు, బాణాసంచాలు కాల్చి సంబరాలు అంబరాన్ని దాటాయి. బత్తలపల్లి, గొట్కూరు, ధర్మవరం ప్రధాన కూడళ్ళ మీదుగా పట్టణంలో భారీ ర్యాలీ ద్వారా మంత్రివర్యులు చేరుకున్నారు. తొలుత నేతన్న విగ్రహానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కళాజ్యోతి సర్కిల్ వద్దనున్న దుర్గమ్మ గుడిలో ప్రత్యేక పూజలు గావించి, దైవ ఆశీస్సులు పొందారు.అలాగే ఇదే మార్గంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అదేవిధంగా రోడ్డుకిరువైపులా ప్రజలు బారులుగా నిలబడి బొకేలు, పూలమాలతో మంత్రికి స్వాగతం పలుకగా ప్రతి ఒక్కరినీ మంత్రి చిరునవ్వుతో ప్రతి నమస్కారం చేస్తూ పేరుపేరునా పలకరిస్తూ ప్రజలకు అభివాదం చేశారు. కీలుగుర్రాలు విచిత్ర వేషధారణ చెక్కభజన కోలాటం లతో ధర్మవరం పట్టణం దద్దరిల్లింది. సత్య కుమార్ యాదవ్కు ఇంత ఆదరణ పట్ల వారు కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు
ఈ కార్యక్రమంలో టిడిపి పార్టీ ప్రతినిధి పరిటాల శ్రీరామ్, పరిటాల సునీత, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, బిజెపి, జిల్లా అధ్యక్షులు శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
డి యం హెచ్ ఓ డా. మంజు వాణి , డిసిహెచ్ఎస్ లు డా. తిప్పేంద్ర నాయక్, డా . రవి కుమార్ , సూపరింటెండెంట్ డా . మాధవి హెల్త్ ఆఫీసర్ వీరమ్మ, పలువురు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు,ఐ ఎం ఎ ప్రతినిధులు తది తరులు పాల్గొన్నారు.