Wednesday, May 1, 2024
Wednesday, May 1, 2024

ప్రతి రైతుకు సంవత్సరానికి ₹20,000 ఆర్థిక సహాయం

అభివృద్ధితోపాటు సంక్షేమానికి బాటలు వేద్దాం
సూపర్ సిక్స్ పథకాలపై ఇంటింటి ప్రచారం

విశాలాంధ్ర- తనకల్లు : 2024 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించిన సూపర్ సిక్స్ పథకాలపై ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ ఎంపీ అభ్యర్థి పార్థసారథులు మండల పరిధిలోని రాచినేపల్లి పాముదూర్చుపల్లి బండకాడిపల్లిలో ఇంటింటికి తిరుగుతూ విస్తృత ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతుకు ప్రతి ఏటా 20 వేల రూపాయలతో పాటు ప్రతి ఇంటికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు,ప్రతి మహిళకు నెలకు 1500 cలేదా మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి, స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15000 రూపాయలు అందించడమే గాక రాష్ట్రంలోని మహిళలందరికీ ఎక్కడికి వెళ్లాలన్నా ఉచిత బస్సు ప్రయాణం కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ చేపడుతుందన్నారు. 2024లో తెలుగుదేశం, జనసేన,బిజెపి పార్టీల ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడుతుందని కదిరి నియోజకవర్గంలో అభివృద్ధికి స్వాగతం పలుకుదాం అన్నారు కదిరిని ఏర్పడబోయే తెలుగుదేశం జనసేన బిజెపి ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి లేని రాష్ట్రానికి దిశా నిర్దేశం చేసి అభివృద్ధి పరిచే సత్తా ఉన్న నాయకుడు మన చంద్రబాబు నాయుడని ముఖ్యమంత్రిని చేసుకోవడం మన అందరి బాధ్యత అన్నారు.2024 ఎలక్షన్లో రెండు ఓట్లు సైకిల్ గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు.ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ రెడ్డి శేఖర్ రెడ్డి, మాజీ కన్వీనర్లు రాజారెడ్డి శంకర్ నాయుడు, దీనికిరా ప్రసాద్ నాయుడు మాజీ జెడ్పిటిసి రవీంద్రరెడ్డి, మస్తాను బావ ప్రవీణ్ కుమార్ స్థానిక నాయకులు గంగి నాయుడు తో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img