శ్రీ సత్య సాయి సేవ సమితి
విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పుట్టపర్తి సత్యసాయిబాబా వారి ఆశీస్సులతో 320 మంది రోగులకు, సహాయకులకు భోజనపు ప్యాకెట్లను, వాటర్ ప్యాకెట్ లను ఆసుపత్రి వైద్యులు, సిస్టర్ల చేతుల మీదుగా శ్రీ సత్యసాయి సేవా సమితి నిర్వాహకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోగులతో పాటు గర్భిణీ స్త్రీలకు స్వీట్లు కూడా పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఇటువంటి కార్యక్రమాలు దాతల సహాయ సహకారంతో నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ మాధవి మాట్లాడుతూ శ్రీ సత్యసాయి సేవా సమితి వారు చేస్తున్న సేవలు స్ఫూర్తినిస్తున్నాయని, ప్రతి ఒక్కరూ సేవా భావాన్ని అలవర్చుకున్నప్పుడు మానవతా విలువలు పెరుగుతాయని తెలిపారు. అనంతరం వారు శ్రీ సత్య సాయి సేవా సమితి వారికి, దాతకు, ఆసుపత్రి తరఫున కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 27 మంది సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు. ఇటువంటి సేవా కార్యక్రమాలకు దాతలుగా ఆసక్తి ఉన్నవారు సెల్ నెంబర్ 9966047044, 9030 444065 గాని సంప్రదించాలని తెలిపారు.