విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని ప్రభుత్వ బాలుర క్రీడా మైదానంలో మూడవరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హాకీ పోటీలు హోరాహోరీగా జరుగుతూ అందర్నీ ఉత్తేజపరుస్తున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల నుండి హాకీ క్రీడాకారులు పాల్గొని తమ సత్తాను చాటుతున్నారు. తదుపరి మూడవరోజు షెడ్యూల్ ప్రకారం పలు జిల్లాల జెట్లు హాకీలో తలపడ్డాయి.ఇందులో శ్రీ సత్య సాయి వర్సెస్ విశాఖపట్నం, ఎన్టీఆర్ వర్సెస్ తిరుపతి.. ఈ నాలుగు జట్లు సెమీ ఫైనల్ కు చేరుకోవడం జరిగింది. ఆదివారం సెమీఫైనల్ ఉదయము, ఫైనల్ సాయంత్రము నిర్వహిస్తారు. ముఖ్య అతిథులుగా పళ్లెం వేణుగోపాల్, బండి వేణుగోపాల్, దాసరి వెంకటేశులు (చిట్టి) శ్వేతా సిల్క్స్- సయ్యద్ హాజరై క్రీడాకారులతో గౌరవ వందనం స్వీకరించిన తర్వాత హాకీ పోటీలను ప్రారంభించారు. విజేతలైన వారిని శ్రీ సత్య సాయి జిల్లా హాకీ కమిటీ వారు అభినందించారు.
అనంతరం ముఖ్య అతిథులను వైస్ ప్రెసిడెంట్, హాకీ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి శ్రీ సత్య సాయి జిల్లా సూర్యప్రకాష్, హాకీ జిల్లా సహాయ కార్యదర్శి అరవిందు గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు గౌరీ ప్రసాద్, మారుతి , అమ్ముద్దీన్, కిరణ్, కోచ్ హేసెన్ తదితరులు శాలువా, పూలమాల, జ్ఞాపకతో ఘనంగా సన్మానించారు. సూర్య ప్రకాష్ మాట్లాడుతూ ఈ రాష్ట్ర హాకీ పోటీలు నిర్వహించడం మాకెంతో సంతోషంగా ఉందని, ఎంతోమంది దాతలు ప్రత్యక్షంగా, పరోక్షంగా తమ సహాయ సహకారాలను అందించి విజయవంతం చేయుటలో వారి పాత్ర ఎంతో కీలకమని తెలిపారు. ఈ పోటీలు 30వ తేదీ వరకు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల పిడీలు, పి ఈ టి లు, హాకీ క్రీడాకారులు పాల్గొన్నారు.