విశాలాంధ్ర- పెనుకొండ : పెనుకొండ తాసిల్దార్ కార్యాలయం ముందు శుక్రవారం రెండవ రోజు వీఆర్ఏలు అర్థనగ్న నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని, ఇచ్చిన డి,ఏ రికవరీ ఉత్తర్వులు ఉపసంహరించాలని, నామినేలుగా పనిచేస్తున్న వారందరినీ వీఆర్ఏలుగా నియమించి ఆ కుటుంబంలో న్యాయం చేయాలని, అందరికీ ప్రమోషన్ ఇవ్వాలి వీఆర్వో వాచ్మెన్ అటెండర్ డ్రైవర్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వీఆర్ఏలకు వర్తింపచేయాలని, 65 సంవత్సరాలు చనిపోయిన వీఆర్ఏ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తదితర డిమాండ్ల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించి విఆర్ఎల్ కు సమస్యలు పరిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు .ఈ కార్యక్రమంలో వీఆర్ఏల సంఘం నాయకులు ఆంజనేయులు, రమేష్, బాబావలి,నరసప్ప ,పుల్లన్న ,గోవిందప్ప ,సుబ్బరాయుడు ,చెన్నకేశవులు తదితరులు పాల్గొన్నారు.