Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

విశాలాంధ్ర- గూడూరు: గూడూరు మండలంలోని గూడూరు జిల్లా పరిషత్ హై స్కూల్ లో శనివారం హెడ్మాస్టర్ డి. పుష్పలత, ఇంచార్జ్ హెడ్మాస్టర్ విజయ రాణి ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కే. స్వరూప మాట్లాడుతూ, కుల ,మత ,లింగ వర్ణ, ప్రాంతీయ భేదాలు లేకుండా వ్యక్తి స్వేచ్ఛగా బతికే అవకాశాన్ని కల్పించింది భారత రాజ్యాంగం, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య లిఖిత రాజ్యాంగం. అనంతరం 1981-82 పదోవ తరగతి పూర్వపు విద్యార్థులు స్కూల్లో విద్యార్థులందరికీ స్వీట్స్, పెన్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో భారత స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎన్ సి సి, విద్యార్థులు, ఉపాధ్యాయులు, పూర్వపు విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img