ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ వెల్లడి
విశాలాంధ్ర – ధర్మవరం:: ధర్మవరం పట్టణంలో చేనేత సమస్యలను తప్పక పరిష్కరిస్తారని ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు 17వ వార్డులో చేనేత నాయకులతో పాటు ఇంటింటా వారు తిరిగి చేనేత సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ గత ఫిబ్రవరిలో నారా భువనేశ్వరి నిజం గెలవాలి అన్న కార్యక్రమంలో భాగంగా వారు చేనేత కుటుంబాలను పరామర్శించడం జరిగిందని అధికారంలోకి రాగానే వారికి అండగా ఉంటాం అన్న భరోసా ఇవ్వడం జరిగిందన్నారు. అందుకే మరోసారి వాటిలోని చేనేతలను కలవడం జరిగిందని, చేనేత కుటుంబాలను పరామర్శించి, వారి సమస్యలను తప్పక పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చేనేత నాయకులు చట్టా లక్ష్మీనారాయణ, పరిసే సుధాకర్, పురుషోత్తం గౌడ్, సంద రాఘవ, జింకా పురుషోత్తం, బీరే శ్రీనివాసులు, అధిక సంఖ్యలో చేనేత నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.