నిబంధనలకు తూట్లు పొడుస్తున్న డిప్యూటీ డిఈఓ శ్రీనివాసరావును
అపార్ట్మెంట్లలో, బిల్డింగ్ నిర్మాణంలో ఉన్న అనుమతి
విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: పాఠశాల విద్యార్థుల ప్రగతి, పరిశోధన, మీద వికాసానికి నిలయంగా ఉండాలి కానీ అనంతపురం జిల్లాలో కార్పొరేట్ విద్యాసంస్థలు వలలో జిల్లా విద్యాశాఖ కాసులు ఇస్తే పర్మిషన్లు అత్యంత సులువు అని చెప్పడమే కాకుండా వాటిని ఆచరణలో అమలు పరుస్తాం అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి కుల్లాయి స్వామి, ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల నరేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు రమణయ్య, ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షుడు ఓబులేసు పేర్కొన్నారు. గురువారం కార్పొరేట్ విద్యాసంస్థలకు ప్రభుత్వ నిబంధనలుకు తూట్లు పొడుస్తూ.. అపార్ట్మెంట్లో, నిర్మాణంలో ఉన్న బిల్డింగులకు డిప్యూటీ డిఈఓ శ్రీనివాసరావు అనుమతులు మంజూరు చేయడంపై డిఇఓ కార్యాలయం వద్ద నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..నాలుగవ రోడ్డులో అపార్ట్మెంట్లో నడుపుతున్న భాష్యం స్కూల్, ఎడిఫై ఓల్డ్ స్కూల్ జిల్లా విద్యాశాఖ అధికారులు రిజెక్ట్ చేసిన ఉన్నత స్థాయి అధికారులు పర్మిషన్ ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటో అంతు పట్టడం లేదని అన్నారు. విద్యాశాఖ అనుమతులు మంజూరులో ప్రభుత్వ మార్గదర్శకాలు తమకు వర్తించవు అన్నట్టుగా.. కార్పొరేట్ విద్య బోధన, పుస్తకాలు, దుస్తులు, బూట్లు పేరుతో అమ్మకాల సరుకు కేంద్రంగా విద్యాసంస్థలు నిలిచిన అధికారులు కార్పొరేట్ విద్యాసంస్థలు కు సైతం వత్తాసు పలుకుతూ నిరుపేదల తల్లిదండ్రుల ఆకాంక్షలకు తూట్లు పొడుస్తూ దోపిడీలో తాము వాటాదారులుగా అన్నట్లుగా వ్యవహార శైలి ఉందన్నారు. రహస్య మంతనాలతో ఉన్నత స్థాయి అధికారులు, జిల్లా అధికారులకు వాటాలు పంపిణీలు చేయడంతోనే నిబంధనలు ఉల్లంఘించిన ఆధారాలు అందజేసిన ఆయా విద్యాసంస్థలకు నోటీసులు ఇవ్వకుండా, జవాబుదారితనం వదిలి ప్రత్యేక అనుమతులు మంజూరు చేశారన్నారు. డిప్యూటీ డిఈఓ పైన సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నిబంధనలు తుంగలో తొక్కుతూ పాఠశాల పేరుతో ముద్రించిన పుస్తకాలు అమ్ముతున్న కార్పొరేట్ విద్యాసంస్థలను తనిఖీ చేసి వాటిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కోశాధికారి హనుమంతు ,నగర అధ్యక్ష కార్యదర్శులు మంజునాథ్, ఉమా మహేష్, జిల్లా ఉపాధ్యక్షులు వంశీ, నగర నాయకులు హరికృష్ణ, హర్ష ,సమీర్ ,రారాజు ,ఎన్ ఎస్ యు ఐ నాయకులు హర్షద్ సాయి, కార్తీక్ పాల్గొన్నారు.