అక్రిడేషన్ మంజూరులో పక్షపాత వైఖరిని ఖండిస్తున్నాం
విశాలాంధ్ర -పెనుకొండ : పెనుకొండ లోని తెదేపా కార్యాలయం నందు గురువారం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వము ఒకటవ తేదీ నుంచి భూముల విలువను స్టాంప్ డ్యూటీని పెంచడంపై రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు ఆమె మాట్లాడుతూ
రాష్ట్ర ప్రభుత్వం ఖజానాను నింపుకునేందుకు భూముల మార్కెట్ విలువను పెంచడం దుర్మార్గమైన చర్య అని రిజిస్ట్రేషన్ చార్జీలు పెరగడంతో భూముల లావాదేవీలు జరగడం కష్టంగా మారుతుందిని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం కాగితాల్లో ధరలను పెంచి ఖజానా నింపుకునేందుకు కుట్ర పన్నుతోందని విమర్శించారు. మండల విలేకరులకు అక్రిడేషన్లు ఇవ్వకుండా మొండి చేయి చూపడం సిగ్గుచేటు అన్నారు సత్య సాయి జిల్లాలో 32 మండలాలు ఉండగా సాక్షి పత్రికకు మాత్రము 53 ఇవ్వగా మిగతా పత్రికలకు జీవోను అడ్డం పెట్టుకొని 17 మాత్రమే మంజూరు చేశారు కనీసం మండల విలేకరికి అక్రిడేషన్ కార్డు లేకుండా చేయడం దుర్మార్గమైన చర్య వార్తలను వెలికి తీసి సభ్య సమాజానికి ఉపయోగపడే పత్రికలను కించపరచడం హేమమైన చర్య గా భావిస్తున్నామని ఆమె ఖండించారు ఈ కార్యక్రమంలో శ్రీరాములు సూర్యనారాయణ ప్రసాద్ సుబ్రహ్మణ్యం త్రివేంద్ర నాయుడు మారుతి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.