విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని పరుచోట్ల అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించుకున్నారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన వారందరూ కూడా యోగా వలన కలిగే ప్రయోజనాలను వివరించడం జరిగింది. ఇందులో భాగంగా పట్టణంలోని కే హెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో యోగా దినోత్సవం వేడుకలు ప్రిన్సిపాల్ డాక్టర్. కే. ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యాపకులతో విద్యార్థులు కలిసి యోగాసనాలను ప్రదర్శించారు. తదుపరి ప్రిన్సిపాల్ మాట్లాడుతూ శారీరిక, మానసిక, ఆరోగ్యానికి దోహదం చేసేదే యోగ అని తెలిపారు. యోగా అనేది సనాతన వారసత్వ సంపదని దానిని విస్మరించడం సరి అయినది కాదు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ గోపాల్ నాయక్, ఫిజికల్ డైరెక్టర్ ఆనంద్, మహిళా సాధికారిక విభాగ అధికారిని చిట్టెమ్మ, షమీవుల్ల, కిరణ్ కుమార్, భువనేశ్వరి అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. పట్టణంలోని శ్రీ సత్య కృప మహిళా డిగ్రీ కళాశాలలో యోగా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ వేడుకలు కరెస్పాండెంట్ పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించగా కళాశాలలో చదువుతున్న విద్యార్థినీలు యోగా చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. తదుపరి యోగా యొక్క ప్రయోజనాలను వివరించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులతో పాటు బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.
కోర్టు లో యోగా దినోత్సవం వేడుకలు:: పట్టణంలోని కోర్టు లోని ఆవరణంలో జాతీయ యోగా దినోత్సవం వేడుకలు జడ్జిలు సీనియర్ సివిల్ జడ్జ్ గీతావాణి, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ రమ్య సాయిల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు. అనంతరం జడ్జిలు మాట్లాడుతూ ప్రతి మనిషికి జీవితములో యోగా ఒక భాగం కావాలని విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరూ యోగాను అలవాటు చేసుకోవాలని తెలిపారు. అనంతరం కోర్టు ఆవరణములో యోగా ఆసనాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ తో పాటు సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. పట్టణంలోని సాయి నగర్ లో గల సూర్య ఉన్నత పాఠశాలలో జాతీయ యోగా దినోత్సవం వేడుకలు ఏబీవీపీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి హిందీ ఉపాధ్యాయులు వేణుగోపాల ఆచార్యులు ముఖ్యఅతిథిగా హాజరై యోగా చేయడం వలన కలిగే లాభాలను వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం నరేంద్రబాబు ఏబీవీపీ పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు ఉపాధ్యాయులు పోతులయ్య, శీనా, ప్రభావతి, కళావతి, జాహ్నవి సునీత, ఏబీవీపీ నాయకులు శశిధర్, కార్తీక్, హరి పాల్గొన్నారు.