జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్
విశాలాంధ్ర -అనంతపురం : 2025 సంవత్సరానికి సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కారం కోసం ఆన్లైన్ దరఖాస్తు ఆహ్వానించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ ఒక ప్రకటనలో తెలిపారు. విపత్తు నిర్వహణ రంగంలో వ్యక్తులు మరియు సంస్థలు చేసిన అద్భుతమైన కృషిని గుర్తించేందుకు భారత ప్రభుత్వం “సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్” పేరుతో వార్షిక అవార్డును నెలకొల్పిందన్నారు. ఈ అవార్డులను సుభాష్ చంద్రబోస్ జయంతి రోజున ప్రకటిస్తారన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అవార్డులను ప్రతి సంవత్సరం జనవరి 23న ఒక సంస్థకు లేదా ఒక వ్యక్తికి వరుసగా రూ. 51 లక్షలు/5 లక్షల నగదు పురస్కారాలను అందజేస్తారన్నారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తును పూరించే ప్రక్రియ 01.07.2024 నుండి 31.08.2024 వరకు గడువు ఉంటుందన్నారు. ఆన్లైన్ దరఖాస్తు ఫారమ్ /అవార్డ్స్ .గోవ్ .ఇన్ ” డబ్ల్యూ .ఈ .ఎఫ్ లో అందుబాటులో ఉంటుందన్నారు. అర్హులైన వారు పూర్తి వివరాలతో దరఖాస్తులను నమోదు చేసుకోవాలని సూచించారు..