చిరుద్యోగులపై వేధింపులు
విశాలాంధ్ర – జేఎన్టీయూఏ: బోధన, పరిశోధనాత్మక రంగాలలో తమదైన ప్రతిభను చాటుతూ ముందుకు వెళ్ళవలసిన ఆచార్యులు టిడిపి గెలుపును జీర్ణించుకోలేక మనోవేదనకు గురవుతున్న తరుణం జేఎన్టీయూలో చోటు చేసుకుంటూ ఉంది. విశ్వవిద్యాలయంలో కొందరు ఆచార్యులు వైకాపా కండువా కప్పుకోలేదు కానీ.. వారు వైకాపాకు వీర విధేయతను చాటారని విశ్వవిద్యాలయం ఉద్యోగులు పేర్కొంటూ ఉండడం గమనార్హం. కొందరు బోధన, బోధ నేతర ఉద్యోగులును నిరంతరం వేధింపులకు గురిచేసిన వారికి నేడు ప్రజల మన్నలను పొందిన కూటమి ప్రభుత్వం నెలకొనడంతో అవినీతి, నిధుల దుర్వినియోగం, ఉద్యోగ నియామకాలు, వాస్తవ విషయాలు వెలుగులోకి వస్తాయో అని భయాందోళన నెలకొంటూ ఉన్న తరుణం నెలకొన్నది. కొందరు ఆచార్యులు పరిపాలన భవనంలోకి విధులు హాజరు కాకుండా నేటిక పదవులును కొనసాగిస్తూ ఉన్నారు. విధులకు హాజరుకాకుండానే జీతాలు పొందుతున్న ఆచార్యులపై చర్యలు చేపట్టకుండా నిర్లక్ష్యపు వైఖరికి విశ్వవిద్యాలయ యంత్రాంగం నిదర్శనంగా నిలుస్తూ ఉంది.
చిరుద్యోగులపై వేధింపులు
ఎటువంటి కలహాలకు పోకుండా విధులు చేస్తున్న ఉన్న టిడిపి సానుభూతిపరులైన చిరుద్యోగులపై వైకాపా ఆచార్యులు వేధింపులు పర్వం కొనసాగించారని పలువురు ఉద్యోగులు పేర్కొన్నారు. చెప్పిన మాట వినకుంటే.. విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలలో దూరంగా బదిలీ చేపట్టి తమ అధికార బలాన్ని చెబుతూ మానసిక వేధింపులు చేపట్టారు. విధులు చేపట్టడం ఒక ఎత్తు అయితే మరోవైపు వ్యక్తిగత అవసరాలకు సైతం వినియోగించుకొని పెత్తందారి వ్యవస్థను నడిపారని అన్నారు.