సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున
విశాలాంధ్ర – ఆత్మకూరు : కర్ణాటక ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న అప్పర్ భద్ర నవళి ప్రాజెక్టులను ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వమని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి సి మల్లికార్జున హెచ్చరించారు. ఆత్మకూరు మండలంలోని తలపూరు, రైతు గర్జన మల్లికార్జున ప్రారంభించారు, వడ్డీపల్లి, మదిగుబ్బ, సనప, తోపుదుర్తి , గ్రామంలో కార్యక్రమానికి మండల కార్యదర్శి సనప నీళ్ళపాల రామక్రిష్ణ అధ్యక్షత వహించారు. సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున మాట్లాడుతూ… తుంగభద్ర డ్యామ్ నుంచి హెచ్ ఎల్ సి ఆధునికరణ పనులు చేపట్టి 5500 క్యూసెక్కులు నీటి నుండి 10000 క్యూసెక్కులు నీటి ప్రవాహాన్ని పెంచాలని డిమాండ్ చేశారు. అప్రభద్ర నవలి నిర్మాణాలు జరిగితే అనంతపురం జిల్లాకు చుక్క నీరు కూడా అందదని ఈ ప్రాంత రైతులకు పంటలు పండక మరీ దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడతాయన్నారు. ఈనెల 21న అనంతపురం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద నిర్వహించే రైతు గర్జన సభకు రైతులు పెద్ద ఎత్తున హాజర రావాలని కోరారు ఈ కార్యక్రమంలో రాప్తాడు నియోజకవర్గం కార్యదర్శి రామకృష్ణ సహాయ కార్యదర్శిలు నాగరాజు శ్రీకాంత్, రాప్తాడు మండల కార్యదర్శ రవీంద్ర కనగానపల్లిమండల కార్యదర్శి,ఎం. బాలరాజు,ఆత్మకూరు మండల సహాయ కార్యదర్శి శివ, రైతు సంఘం నియోజకవర్గ కార్యదర్శి వెంకటనారాయణ , చలపతి, నాగేష్ , ఏఐవైఎఫ్ నియోజకవర్గ కార్యదర్శిధనుంజయ, మహిళా సంఘం నియోజకవర్గ కార్యదర్శి శారద, శాఖ కార్యదర్శులు అక్కులన్న రెడ్డప్ప, వెంకటేష్ ,తీరుపల్ నాయక్ గోవిందు, ఓబులేష్, నారాయణమ్మ, లక్ష్మీదేవి,గోపాల్ నాయుక్, తాతయ్య, మస్తాను, ఈశ్వరయ్య, తదితరులు పాల్గొన్నారు.