Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

లోకేష్ పాదయాత్రకు సంఘీభావం

విశాలాంధ్ర-రాప్తాడు : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువ నాయకుడు నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రకు రాప్తాడు టీడీపీ నాయకులు సంఘీభావం తెలిపారు. కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు నాలుగు వేల కిలోమీటర్ల దూరం చేపడుతున్న పాదయాత్ర సజావుగా సాగాలని…ఇందులో భాగంగా రాప్తాడు నియోజకవర్గంలోని రాప్తాడు మండలంలోకి అడుగుపెట్టడంతో పూలమాలలు, పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. అదేవిధంగా రాప్తాడు పంగల్ రోడ్డుపై పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చారు. ఆకుతోటపల్లి విడిది కేంద్రంలో మంగళవారం ఉదయం పార్టీ శ్రేణులు, అభిమానులను ఆప్యాయంగా పలకరించారు. వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని, వైసీపీకి, సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రజలు తగిన గుణపాఠం చెపుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ పంపు కొండప్ప, ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి శ్రీనివాసులు, మరూరు గోపాల్, గంగలకుంట రమణ, కిష్ట, సర్పంచ్ సాకే తిరుపాలు, రామకృష్ణ, రామనేపల్లి రాము, ముత్యాలు, పసుపుల బాబయ్య, కొత్తపల్లి నారాయణస్వామి, నంబూరి రమణ, దండు నరేంద్ర, పెద్దిరెడ్డి, లక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img