విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని ముస్లిం సోదరులు బక్రీద్ పండుగను అత్యంత వైభవంగా నిర్వహించుకున్నారు. పట్టణ సమీపంలోని కేతిరెడ్డి కాలనీలో గల ఈద్గా మైదానంలో సామూహికంగా ముస్లిం సోదరులు బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని మత పెద్దలు ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు (నమాజ్) నిర్వహించుకున్నారు. బక్రీద్ పండుగను పురస్కరించుకొని ధర్మవరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ రాష్ట్ర కన్వీనర్ నరేంద్ర చౌదరి ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ముస్లిం సోదరులను ఆలింగణం చేసుకొని ఈద్ ముబారక్ ను ప్రతి ఒక్కరికి తెలియజేశారు. ముస్లింలు సంతోషంగా జీవించాలని తాము ప్రత్యేక ప్రార్థనలు చేయడం జరిగిందని తెలిపారు. ఇస్లాం లో త్యాగం దాన గుణాలకు ప్రత్యేకమైన స్థానము ఉందని ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ జరుపుకునే పండుగనే బక్రీద్ను జరుపుకుంటారన్నారు. ముస్లిముల సమస్యల పరిష్కారం కోసం తన వంతుగా ఎమ్మెల్యే రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ ద్వారా పరిష్కరించడం జరుగుతుందని హామీ ఇచ్చారు. తదుపరి ముస్లిం సోదరులు పిల్లలు ఒకరినొకరు ఆలింగణం చేసుకొని ఈద్ ముబారక్ తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ముస్లిం టిడిపి నాయకులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.