టీటీడీ ధర్మాచార్యులు నక్కల వెంకటేష్
విశాలాంధ్ర – ధర్మవరం : తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆధ్యాత్మిక కార్యక్రమములో భాగంగా భజన కార్యక్రమాలను నిర్వహించేందుకు తిరుమలలో అఖండ హరినామ సంకీర్తన భజనల కోసం ధర్మవరం శ్రీహరి భజన బృందం ఎంపిక కావడం జరిగిందని టీటీడీ ధర్మాచార్యులు నక్కల వెంకటేష్, శ్రీహరి భజన బృందం అధ్యక్షులు ఆదినారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా బుధవారం వారు మాట్లాడుతూ పట్టణములోని తిక్క స్వామి దేవాలయంలో నిర్వహిస్తున్న శ్రీహరి భజన బృందం ఎంపిక కావడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని వారు తెలిపారు. ఈ అవకాశం రావడం తమకు ఎంతో సంతోషంగా ఉందని తిరుమల తిరుపతి కార్యాలయ అధికారులకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఎంపిక అయిన వారిలో ఈడిగ రత్నం, టైలర్ నారాయణస్వామి, ఆదినారాయణ రెడ్డి, నారాయణరెడ్డి, శేఖర్, కుళ్ల యప్ప, చెన్నారెడ్డి, కేశవ, నారాయణ, తిమ్మయ్య, సుబ్బయ్యలు పాల్గొంటారని తెలిపారు. ఇందులో భాగంగా తిరుమలకు బయలుదేరుతున్న వీరందరికీ కూడా శుభాకాంక్షలు తెలిపారు.